ఏపీలో ఉపాధికూలీల ఆకలికేకలు: Devineni
ABN , First Publish Date - 2021-11-02T14:19:12+05:30 IST
ఏపీలో ఉపాధి కూలీల ఆకలికేకలు ఎక్కువయ్యాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు.
అమరావతి: ఏపీలో ఉపాధి కూలీల ఆకలికేకలు ఎక్కువయ్యాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. రెండున్నర నెలలుగా భత్యం లేదని అన్నారు. ఇబ్బందుల్లో లక్షల మంది కూలీలు ఉన్నారని తెలిపారు. మరో 5 నెలలు ఇదే పరిస్థితి ఉండనుందని చెప్పారు. నిధులు సర్ధి రియంబర్స్కు సర్కార్ సిద్ధంగా లేదని మండిపడ్డారు. విచ్చలవిడిగా అధికారపార్టీ నేతలు చేసిన దోపిడీకి, ఆర్ధిక ఇబ్బందులతో కుదేలవుతున్న కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారని దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.