అభివృద్ధి పనులను గాలికి వదిలేశారు: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-09-09T00:57:11+05:30 IST

రాష్ట్రంలో కమీషన్ల కోసం రోడ్డు అభివృద్ధి పనులను గాలికి

అభివృద్ధి పనులను గాలికి వదిలేశారు: దేవినేని ఉమ

విజయవాడ: రాష్ట్రంలో కమీషన్ల కోసం రోడ్డు అభివృద్ధి పనులను గాలికి వదిలేశారని ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు దేవినేని ఉమా ధ్వజమెత్తారు. గుంటలు పూడ్చేందుకు 15 కోట్లు ఖర్చు పెట్టడం గొప్పగా చెప్పుకుంటున్నారని మంత్రులను ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రం అప్పుల్లో కురుకుపోయిందని ఉమా ఆరోపించారు. అప్పులు తెచ్చి డబ్బులు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదన్నారు. కరెంటు బిల్లులు పెంచి ప్రభుత్వం పేదల కడుపులు కొడుతున్నదని ఉమా ఆరోపించారు. 

Updated Date - 2021-09-09T00:57:11+05:30 IST