Drugs పై ఆధారాలివ్వాలని.. ధూళిపాళ్లకు కాకినాడ పోలీసులు నోటీసులు

ABN , First Publish Date - 2021-10-08T15:40:27+05:30 IST

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం పొన్నూరు మండలం చింతలపూడిలోని నరేంద్ర ఇంటికి వచ్చిన పోలీసులు నోటీసులను అందజేశారు.

Drugs పై ఆధారాలివ్వాలని.. ధూళిపాళ్లకు కాకినాడ పోలీసులు నోటీసులు

గుంటూరు: టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం పొన్నూరు మండలం చింతలపూడిలోని నరేంద్ర ఇంటికి వచ్చిన పోలీసులు నోటీసులను అందజేశారు. మాదకద్రవ్యాల రవాణాపై  ప్రభుత్వంపై  నరేంద్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆధారాలు ఇవ్వాలని నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న తర్వాత నరేంద్ర మీడియాతో మాట్లాడారు.


కాకినాడ తీరంలో బోటు తగలబడినప్పుడు మాదకద్రవ్యాల వాసన వచ్చిందని సమాచారం ఉందని...ఇదే సమాచారంతో తాను మీడియాతో మాట్లాడినట్లు తెలిపారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వేల కోట్ల డ్రగ్స్ దొరికితే ముఖ్యమంత్రి తీరిగ్గా స్పందించారని మండిపడ్డారు. విద్యాసంస్థల్లో మత్తు మందులు ఉండరాదని ముఖ్యమంత్రి చెప్పటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటి వరకూ విద్యాసంస్థల్లో మత్తు మందులు ఉన్నట్లే అనిపిస్తోందని ధూళిపాళ్ల పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-08T15:40:27+05:30 IST