జగన్రెడ్డి ఆంధ్రా ఔరంగజేబ్!
ABN , First Publish Date - 2021-03-03T09:38:59+05:30 IST
రాష్ట్రం, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు తనకు మాత్రం ఓట్లేస్తే చాలని వైసీపీ అధినేత, సీఎం జగన్రెడ్డి అనుకుంటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి
టీడీపీ నేత దివ్యవాణి ఎద్దేవా
అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం, ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు తనకు మాత్రం ఓట్లేస్తే చాలని వైసీపీ అధినేత, సీఎం జగన్రెడ్డి అనుకుంటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఎద్దేవా చేశారు. చంద్రబాబును నిర్భంధించడం ద్వారా జగన్రెడ్డిని ఆంధ్రా ఔరంగజేబ్ అని ప్రజలు పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు.
వైసీపీకి ఓట్లేయలేదని పింఛన్ల తొలగిస్తున్నారు
పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతుదారులకు ఓట్లేయనివారి పింఛన్లను తొలగిస్తూ వైసీపీ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని టీడీపీ అధికార ప్రతినిధి ఎంఎస్ రాజు ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో రెండు గ్రామాల్లో 70, గుంటూరులో 150 పింఛన్లు తొలగించారని ఆరోపించారు.
దళితులకు రక్షణ లేదు: జవహర్
దేశంలో దళితులకు రక్షణ లేదని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. హత్రాస్ సంఘటన దేశంలో వాస్తవ పరిస్థితులను తెలియజేస్తోందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలో దళిత, బడుగు, బలహీన వర్గాలు ద్వితీయ స్థాయి పౌరులుగా జీవిస్తున్నారని వ్యాఖ్యానించారు. దళితులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్రెడ్డి దళితుల రక్షణకు బదులు వారిని భక్షించే వారికి భరోసా కల్పిస్తున్నారని ఆరోపించారు.