నీటమునిగి టీడీపీ నాయకుడి మృతి
ABN , First Publish Date - 2021-10-18T06:09:04+05:30 IST
మండలంలోని మల్లేపల్లి గ్రామ సమీపంలోని యాడికి కాలువలోని సుడిగుండంలో చిక్కుకొని టీడీపీ నాయకుడు సూర్యనారాయణ యాదవ్ (42) మరణించాడు.
పెద్దవడుగూరు, అక్టోబరు 17 : మండలంలోని మల్లేపల్లి గ్రామ సమీపంలోని యాడికి కాలువలోని సుడిగుండంలో చిక్కుకొని టీడీపీ నాయకుడు సూర్యనారాయణ యాదవ్ (42) మరణించాడు. ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం సూర్యనారాయణయాదవ్ తన పొట్టేళ్లను కాలువలో శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు సుడిగుండంలో చిక్కుకొని మృతిచెందాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, పదిరోజుల క్రితం ఇదే కాలువలో బందార్లపల్లె గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి మృతిచెందాడు. ఇప్పటికైనా ప్రజలకు ఈ ప్రమాదాలపై అధికారులు సరైన అవగాహన కల్పించాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.
యల్లనూరు మండలంలో బాలుడు ...
యల్లనూరు: మండలంలోని లక్షుంపల్లి గ్రామ సమీపంలో కార్తీక్ (14) చిత్రావతినదిలో మృతిచెందాడు. ధర్మవరానికి చెందిన విజయభాస్కర్ కుటుంబసభ్యులతో పెద్దస్వామి దర్శనానికి లక్షుంపల్లికి ఆదివారం వచ్చాడు. గుడి సమీపంలోని నదిలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తు అతని కుమారుడు కార్తీక్ కిందపడి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. గాలించి.. అతన్ని వెలికి తీయగా.. అప్పటికే మరణించాడు. ఉన్న ఒక్క కుమారుడు దూ రం కావడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.