2024 ఎన్నికలకు చాలా సమయముంది: Ganta
ABN , First Publish Date - 2022-01-18T15:39:50+05:30 IST
స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బీచ్రోడ్లో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పూలమాలతో నివాళులర్పించారు.
విశాఖపట్నం: స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బీచ్రోడ్లో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు జాతిని చాటి చెప్పింది స్వర్గీయ ఎన్టీఆర్ అని అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది అంటే అది ఎన్టీఆర్ ఘనతే అని... ఆయన ఆశయాలే తమకు స్ఫూర్తి అని తెలిపారు. 2024 ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉందన్నారు. పార్టీకి అత్యున్నతమైన కమిటీ ఉందని... ఆ కమిటీకి అనుగుణంగానే ఎన్నికల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. గంటాతో పాటు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పలువురు నేతలు ఎన్టీఆర్కు నివాళులర్పించారు.