మళ్లీ సరిహద్దుల్లో అంబులెన్స్‌ల గొడవ బాధాకరం: గోరంట్ల

ABN , First Publish Date - 2021-05-14T18:17:11+05:30 IST

పీ-తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

మళ్లీ సరిహద్దుల్లో అంబులెన్స్‌ల గొడవ బాధాకరం: గోరంట్ల

అమరావతి: ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘మళ్ళీ సరిహద్దుల్లో అంబులెన్స్‌ల గొడవ పునరావృతం అవ్వడం బాధాకరం. అంబులెన్స్‌లు కదలక ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. ఒక పక్కన కోర్టులు చెబుతున్న ప్రభుత్వాలు సహకారం లేకపోవడం దౌర్భాగ్యం. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీని పై మాట్లాడాలి. తగు నిర్ణయం తీసుకుని ప్రజలకి ఇబ్బందులు కలగకుండా చూడాలి. పాలకుల నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఒక్కసారి దీనిపై చర్చించండి’’ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-05-14T18:17:11+05:30 IST