ఏపీలో విద్యుత్‌రంగం కుదేలైంది: కళా వెంకట్రావు

ABN , First Publish Date - 2022-01-27T02:01:35+05:30 IST

వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఏపీలో విద్యుత్‌రంగం కుదేలైందని టీడీపీ

ఏపీలో విద్యుత్‌రంగం కుదేలైంది: కళా వెంకట్రావు

అమరావతి: వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఏపీలో విద్యుత్‌రంగం కుదేలైందని టీడీపీ నాయకుడు కళా వెంకట్రావు విమర్శించారు. ప్రజలపై జగన్‌రెడ్డి రూ.37 వేల కోట్ల విద్యుత్ భారాన్ని మోపారని ఆయన ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.2,432 కోట్లు ఆదా చేస్తామన్న ప్రభుత్వం వినియోగదారులపై ఎందుకు భారం మోపాలని చూస్తోందని ఆయన ప్రశ్నించారు. ఆదా చేస్తే ట్రూ డౌన్ చార్జీలు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన నిలదీశారు. ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన రూ.22 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-01-27T02:01:35+05:30 IST