న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడింది: కేశినేని నాని

ABN , First Publish Date - 2020-05-30T18:49:28+05:30 IST

న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడింది: కేశినేని నాని

న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడింది: కేశినేని నాని

అమరావతి: ఎస్‌ఈసీ నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడంపై ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘న్యాయం గెలిచింది..చట్టం గెలిచింది.. ప్రజాస్వామ్యం గెలిచింది.. రాజ్యాంగం గెలిచింది. న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం నిలబడింది’’ అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు. 


ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తొలగించడమే లక్ష్యంగా.... జారీ చేసిన ఆర్డినెన్స్‌ను, ఇతర జీవోలను హైకోర్టు కొట్టివేసింది. తప్పుచేసినట్లు రుజువు చేసి అభిశంసిస్తే తప్ప... ఆయనను అర్ధంతరంగా పదవి నుంచి తప్పించలేరని తేల్చిచెప్పింది. ‘నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా ఐదేళ్లూ పదవిలో ఉండటం ఆయన హక్కు. దానిని మధ్యలో ఎవరూ లాక్కోలేరు’ అని స్పష్టం చేసింది. ఆయనను పూర్తికాలం పదవిలో కొనసాగించాలని హైకోర్టు  ఆదేశించిన విషయం తెలిసిందే. 




Updated Date - 2020-05-30T18:49:28+05:30 IST