వైసీపీ పాలనలో మహిళలకు పూర్తిగా భద్రత కరువు: కొల్లు రవీంద్ర
ABN , First Publish Date - 2021-06-23T18:41:56+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనలో మహిళలకు పూర్తిగా భద్రత లేకుండాపోయిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలనలో మహిళలకు పూర్తిగా భద్రత లేకుండాపోయిందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఓ ఆడబిడ్డపై అత్యాచారం జరిగితే ఇప్పటికి సరైన స్పందన లేదన్నారు. రాష్ట్రంలో దిశా చట్టం ఏమైంది, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తానన్న సీఎం ప్రగల్భాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. పోలీసులు కేవలం టీడీపీ నాయకులపై కక్ష్య సాధించడం కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. మహిళలపై దాడులు వాళ్ళకి పట్టవన్నారు. ఆడ బిడ్డలకు రక్షణ కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నామని... ఇలాంటి ఘటనలకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేస్తున్నామన్నారు.