ధృవతారగా వెలిగిన బాలయోగికి నివాళులు: లోకేష్
ABN , First Publish Date - 2021-03-03T16:13:52+05:30 IST
దివంగత నేత బాలయోగి వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నివాళులర్పించారు.
అమరావతి: దివంగత నేత బాలయోగి వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నివాళులర్పించారు. ‘‘బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి.. కోనసీమ అభివృధ్ధికి స్ఫూర్తిదాయకమైన సేవలందించి... తెలుగువారి ప్రతిభను చాటుతూ లోక్సభ స్పీకర్ హోదాలో దేశ రాజకీయాల్లోనే ఒక ధ్రువతారగా వెలిగారు జీఎంసీ బాలయోగిగారు. బాలయోగిగారి వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానాయకుని స్మృతికి నివాళులు’’ అంటూ లోకేష్ పేర్కొన్నారు.