రైతు వేమారెడ్డికి తక్షణమే న్యాయం చేయాలి: Lokesh

ABN , First Publish Date - 2021-10-05T17:26:15+05:30 IST

జగన్ రెడ్డి చెత్త పాలనలో రోజుకో రైతు న్యాయం చెయ్యండంటూ రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు.

రైతు వేమారెడ్డికి తక్షణమే న్యాయం చేయాలి: Lokesh

అమరావతి: జగన్ రెడ్డి చెత్త పాలనలో రోజుకో రైతు న్యాయం చెయ్యండంటూ రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం రాజుపాలెం గ్రామంలో నష్టపరిహారం ఇవ్వకుండానే రైతు వేమారెడ్డి భూమి లాక్కొని స్వయంగా మంత్రి అనుచరులే జేసీబీలతో దౌర్జన్యంగా  గండి కొట్టి పొలాలు మీదుగా నీటిని మళ్లించడం దారుణమన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని... రైతు వేమారెడ్డికి తక్షణమే న్యాయం  చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-05T17:26:15+05:30 IST