నిరాశ, నిస్పృహలో ఏపీ యువత: Lokesh

ABN , First Publish Date - 2022-01-12T15:33:57+05:30 IST

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నివాళులర్పించారు.

నిరాశ, నిస్పృహలో ఏపీ యువత: Lokesh

అమరావతి: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నివాళులర్పించారు. భారతీయ యువతరంలో చైతన్యం నింపడానికి, ఆత్మ విశ్వాసం కలిగించడానికి తన జీవితమంతా కృషి చేసిన మహాశయుడు స్వామి వివేకానంద అని అన్నారు. ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ  తెలుగు యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరమని స్వామి వివేకానంద అన్నారన్నారు. కానీ ఏపీలో యువత అడుగడుగునా నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిందని తెలిపారు. ‘‘జాబ్ కాలెండర్ రాదు. పరిశ్రమలు రావు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావు. స్వయం ఉపాధి రుణాలు మంజూరు కావు. విదేశీ విద్యకు సాయం లేదు’’ అని విమర్శించారు.  యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వానికి యువతరమే బుద్ధి చెప్పే రోజు త్వరలో రానుందన్నారు. అప్పుడు నిజమైన యువజనోత్సవాలను ఘనంగా చేసుకుందామని... అప్పటివరకు మార్పు కోసం కృషి చేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-01-12T15:33:57+05:30 IST