కుప్పంలో Lokesh ఎన్నికల ప్రచారం

ABN , First Publish Date - 2021-11-12T17:31:29+05:30 IST

కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది.

కుప్పంలో Lokesh ఎన్నికల ప్రచారం

చిత్తూరు: కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో  శుక్రవారం 1వ వార్డు బండ శెట్టిపల్లి ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రెండున్నరేళ్లుగా కుప్పంను పట్టించుకోని వైసీపీ నాయకులు ఇప్పుడు వచ్చి కుక్కల్లా మొరుగుతున్నారని విమర్శించారు. వైసీపీ రౌడీలు, గుండాలు, ఎర్ర చందనం స్మగ్లర్లు ప్రశాంతమైన కుప్పం వచ్చి అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం బాటిల్ దగ్గర్నుంచి నిత్యం తినే పప్పు, ఉప్పు వరకు అన్ని రకాల ధరలను  వైసీపీ అమాంతం పెంచేసిందన్నారు. రౌడీలు గూండాలకు భయపడకుండా ఓటు వేసి టీడీపీని గెలిపించాలని లోకేష్ కోరారు. 

Updated Date - 2021-11-12T17:31:29+05:30 IST