చిన్నారులు బలైపోతున్నారు: లోకేష్
ABN , First Publish Date - 2021-09-05T01:35:48+05:30 IST
వైసీపీ నేతల ధన దాహానికి చిన్నారులు బలైపోతున్నారని టీడీపీ నాయకుడ లోకేష్
అమరావతి: వైసీపీ నేతల ధన దాహానికి చిన్నారులు బలైపోతున్నారని టీడీపీ నాయకుడ లోకేష్ ఆరోపించారు. నాడు-నేడు పేరుతో లెక్కాజమ లేకుండా వందల కోట్లు తినేస్తూ పిల్లల్ని ప్రమాదంలో పడేస్తున్నారన్నారు. నాడు బడి - నేడు పాడుబడిందన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి విద్యార్థి విష్ణు మృతి చెందాడన్నారు. కర్నూలు జిల్లాలో స్లాబ్ పెచ్చులూడి పడటంతో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి నియోజకవర్గంలో విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. శిథిలమైన భవనం, ఉపాధ్యాయులు ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని లోకేష్ అన్నారు. తమకు పాఠశాల భవనం నిర్మించాలని విద్యార్థులు, గ్రామస్తులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వైసీపీ నేతలు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పబ్లిసిటీ స్టంట్స్, సొంత పత్రికలో డబ్బా యాడ్స్ మాని విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని లోకేష్ హితవు పలికారు.