మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్: లోకేష్

ABN , First Publish Date - 2021-12-15T02:15:32+05:30 IST

సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా

మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్: లోకేష్

అమరావతి: సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. "నేడు మాట మార్చుడు, మడమ తిప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్ రెడ్డి మారారు" అని ఆయన ధ్వజమెత్తారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న మాటకి రెండున్నరేళ్ళు అయినా దిక్కు లేదన్నారు. పైగా జగన్‌కు అవగాహన లేకే సీపీఎస్ రద్దు చేస్తామనే హామీ ఇచ్చారంటూ సజ్జల ప్రకటించడం ఉద్యోగులని దారుణంగా మోసగించడమేనని ఆయన ఆరోపించారు.


నెరవేర్చని హామీలిచ్చి వంచించిన  జగన్ రెడ్డి ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యోగులు చేస్తోన్న పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-15T02:15:32+05:30 IST