కుప్పంలో రెండో రోజు Lokesh పర్యటన వివరాలు
ABN , First Publish Date - 2021-11-12T13:51:00+05:30 IST
కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండవ రోజు పర్యటన కొనసాగనుంది.
చిత్తూరు: కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండవ రోజు పర్యటన కొనసాగనుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలు వార్డుల్లో లోకేష్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రోడ్ షో ప్రారంభంకానుంది. బండశెట్టిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో లోకేష్ పాల్గొననున్నారు. సామగుట్టవల్లి, లక్ష్మీపురం, బాబునగర్, బీసికాలనీ, విజయలక్ష్మి రోడ్డు, తంబిగానిపల్లి, అనిమిగానిపల్లి, వడ్డిపల్లి, సంపంగినగర్, డి.కె.పల్లి, మోడల్ కాలనీ, రాములవారి గుడి మీదుగా ప్రచారం జరుగనుంది. ఉదయం 9గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లోకేష్ రోడ్ షో కొనసాగనుంది.