నీ రాసలీలలు రాష్ట్రమంతా తెలుసు

ABN , First Publish Date - 2021-03-08T09:40:22+05:30 IST

కొడుకును కబ్జాలకు వదిలేసి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేటు వయస్సులో రాసలీలలు నెరుపుతున్న

నీ రాసలీలలు రాష్ట్రమంతా తెలుసు

బాలినేనిపై టీడీపీ నేత మాణిక్యాలరావు ఫైర్‌  



అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): కొడుకును కబ్జాలకు వదిలేసి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేటు వయస్సులో రాసలీలలు నెరుపుతున్న సంగతి రాష్ట్రప్రజలందరికీ తెలుసని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు. ఒంగోలులో లోకేశ్‌ పర్యటన ఉందంటేనే ఉలిక్కిపడే మంత్రి బాలినేని.. ఇంతకాలం ఏ కలుగులో దాక్కున్నారో? చెప్పాలని ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.   ‘మీ నాయకుడు జగన్‌రెడ్డి ఆర్థిక నేరస్థుడు. తండ్రి నమ్మిన పార్టీని సమాధి చేసిన దుర్మార్గుడు. తల్లినీ, చెల్లినీ చెల్లని చీటీలు చేసి, హైదరాబాద్‌కు పరిమితం చేసిన నీచుడు’ అని విమర్శించారు.  


ప్రజాస్వామ్యం ఖూనీ: చింతకాయల విజయ్‌

పోలీ్‌సస్టేషన్‌ వెనకాలే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల ఆరోపించారు. వలంటీర్లు డబ్బులు పంచుతున్నారని ఎన్నికల కమిషన్‌కు చెప్పినందుకు ఎన్నికల కమిషన్‌ ముందే తమ పీఆర్వోపై రుత్తల భాస్కరరావు దాడి చేశారన్నారు.  

Updated Date - 2021-03-08T09:40:22+05:30 IST