ముందు ప్రజలు..తర్వాతే కంపేనీ: నక్కా ఆనంద్‌ బాబు

ABN , First Publish Date - 2021-07-13T18:42:50+05:30 IST

జిందాల్ కంపెనీకి టీడీపీ హాయంలోనే అనుమతించామని...అయితే డ్రైనేజీ వాటర్ రీసైక్లింగ్ ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పామని టీడీపీ నేత నక్కా ఆనంద్‌ బాబు తెలిపారు.

ముందు ప్రజలు..తర్వాతే కంపేనీ: నక్కా ఆనంద్‌ బాబు

గుంటూరు:  జిందాల్ కంపెనీకి  టీడీపీ హాయంలోనే అనుమతించామని...అయితే డ్రైనేజీ వాటర్ రీసైక్లింగ్ ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పామని టీడీపీ నేత నక్కా ఆనంద్‌ బాబు తెలిపారు. ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అవసరం ఉందని అన్నారు. ముందు ప్రజలు.. తర్వాతే కంపేనీ అని స్పష్టం చేశారు. చెరువులో నీరు జిందాల్ కంపేనీకి ఇస్తే గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. గ్రామ సర్పంచ్, మాజీ ఎంపీటిసీలపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. దీనిపై ఉద్యమిస్తామని...ప్రైవేట్ కేసులు వేస్తామని, కోర్టులో పోరాటం చేస్తామని నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. మంగళవారం అర్బన్ ఎస్పీని కలిసిన టీడీపీ నేతల బృందం.. వెంగళాయపాలెం సర్పంచ్, మాజీ ఎంపీటీసీలపై తప్పుడు కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-07-13T18:42:50+05:30 IST