జగన్ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే పవన్పై విమర్శలు: నక్కా ఆనంద్
ABN , First Publish Date - 2021-09-30T19:24:20+05:30 IST
జగన్ రెడ్డి తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు.
గుంటూరు: జగన్ రెడ్డి తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలన రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. పంట కొనుగోలు దగ్గర వైసీపీ దళారులు రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. పంట కొనుగోలు విషయంలో జగన్ ప్రభుత్వం భూటకపు మాటలు చెబుతున్నారన్నారు. వేమూరు మార్కెట్ యార్డును రైతుల కంటే ఇసుక మాఫీయా కోసమే వాడుతున్నారని తెలిపారు. వేమూరు నియోజకవర్గం లో రచ్చబండ నిర్వహిద్దామని.... దమ్ముంటే ఎమ్మెల్యే మేరుగ నాగార్జున వచ్చి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్ విసిరారు. జగన్ రెడ్డి పాలనలో యువత మత్తుకు బానిసలు అవుతున్నారన్నారు. ప్రపంచంలో అతిపెద్ద డ్రగ్ డీల్ ఏపిలో వెలుగు చూడటం సిగ్గు చేటని నక్కా ఆనంద బాబు వ్యాఖ్యలు చేశారు.