చివరికి వాళ్ల గతి ఏమైందో జగన్ తెలుసుకోవాలి: లోకేష్

ABN , First Publish Date - 2021-06-18T17:57:14+05:30 IST

ఏపీలో రాజా రెడ్డి రాజ్యంగం అమలవుతోందని...అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.

చివరికి వాళ్ల గతి ఏమైందో జగన్ తెలుసుకోవాలి: లోకేష్

కర్నూలు: ఏపీలో రాజా రెడ్డి రాజ్యంగం అమలవుతోందని...అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. శుక్రవారం కర్నూలులో హత్యకు గురైన ఇద్దరు టీడీపీ నేతల కుటుంబాలను లోకేష్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇద్దరు నాయకులు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను హత్య చేయడం దారుణమన్నారు. ‘‘కొన్ని కుక్కలను హెచ్చరిస్తున్నా...నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని వైసీపీ వాళ్ళు పశువుల్లా నరికి చంపారు. 20 ఏళ్ల పాటు గ్రామాన్ని అభివృద్ధి చేయడమే వాళ్ళు చేసిన  తప్పా...నాగేశ్వర్ రెడ్డి లైసెన్సుడు గన్ పంచాయతీ ఎన్నికల ముందు తీసుకున్నారు. ఎన్నికల తరువాత గన్ అడిగితే ఎందుకు ఇవ్వలేదు. గన్ ఇచ్చి ఉంటే ఈ దారుణం జరిగేది కాదు. నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని చంపిన వాళ్ళను 24 గంటలు గడచిన ఎందుకు అరెస్ట్ చేయలేదు. రాజా రెడ్డి, వైఎస్సార్ కూడా టీడీపీ శ్రేణులు చంపించారు. చివరికి వాళ్ళ గతి ఏమైందో జగన్ తెలుసుకోవాలి. హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలి. దమ్ముంటే సమగ్ర విచారణ చేయించాలి’’ అంటూ సవాల విసిరారు. చంద్రబాబు  సీఎం గా ఉన్నపుడు చిటికి వేసుంటే బయట తిరుగుండేవాళ్ళా... పాదయాత్ర చేసుండేవాళ్ళాఅని ప్రశ్నించారు. 27 మంది టీడీపీ నేతలను హత్య చేశారన్నారు. 400 మందిపై దాడి చేశారని తెలిపారు. వీటిని వ్యక్తిగాంతంగా తీసుకుంటా....వడ్డీతో సహా చెల్లిస్తా అని హెచ్చరించారు. నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి కుటుంబాలకు అండగా ఉంటామని వారిని ఆదుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. 

Updated Date - 2021-06-18T17:57:14+05:30 IST