పరీక్షలు రద్దు చెయ్యని ఏకైక రాష్ట్రం ఏపీ: లోకేష్

ABN , First Publish Date - 2021-06-23T17:28:37+05:30 IST

రాష్ట్రంలో పరీక్షలు నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమమని...80లక్షల మందికి దీని ద్వారా ముప్పు పొంచి ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.

పరీక్షలు రద్దు చెయ్యని ఏకైక రాష్ట్రం ఏపీ: లోకేష్

అమరావతి: రాష్ట్రంలో పరీక్షలు నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమమని...80లక్షల మందికి దీని ద్వారా ముప్పు పొంచి ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. దేశంలో పరీక్షలు రద్దు చెయ్యని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు.  ఓ తండ్రిలా ఆలోచించా కాబట్టే విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు పరీక్షలు రద్దు చేయమని రెండు నెలలుగా పోరాటం చేస్తున్నా అని  చెప్పుకొచ్చారు. కరోనా తీవ్రతలో దేవాన్ష్ పరీక్షలు రాయాల్సి వస్తే పరిస్థితేంటని ఆవేదన చెందే విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకుని రద్దు డిమాండ్ చేశామని తెలిపారు. మొండితనంతో 15లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం ప్రభుత్వానికి తగదన్నారు. దేశమంతా ఒక దారిలో వెళ్తుంటే అందుకు విరుద్ధంగా జగన్ రెడ్డి వైఖరి సరికాదని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనని దృష్ట్యా తక్షణమే పరీక్షలు రద్దు చెయాలని డిమాండ్ చేశారు. పరీక్షలు రద్దు నిర్ణయాన్ని వెంటనే అఫిడవిట్ ద్వారా సుప్రీం కోర్టుకి తెలపాలన్నారు. పరీక్షల రద్దుకు మద్దతు తెలిపిన దాదాపు 7లక్షల మంది అభిప్రాయాలను ముఖ్యమంత్రి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండాపోయిందని లోకేష్ తెలిపారు. 

Updated Date - 2021-06-23T17:28:37+05:30 IST