ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో: లోకేష్

ABN , First Publish Date - 2020-10-27T16:17:16+05:30 IST

రైతులను పరామర్శించేందుకు వెళ్లిన తనపై కేసులు నమోదు చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో: లోకేష్

అమరావతి: రైతులను పరామర్శించేందుకు వెళ్లిన తనపై కేసులు నమోదు చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘రైతుల్ని పరామర్శించడం, రైతులకి అండగా పోరాటం చెయ్యడం, రైతులకి న్యాయం చెయ్యమని డిమాండ్ చెయ్యడం జగన్ రెడ్డి దృష్టిలో నేరం. ఈ నేరంపై కేసు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్దలేవు. అందుకే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన, ట్రాక్టర్ నడిపారంటూ నాపై కేసులు బనాయించారు. వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని జగన్ రెడ్డి, గడప గడపకీ వెళ్లే నన్ను అడుగడుగునా అడ్డుకోవాలనుకుంటున్నారు. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో! కష్టాలలో ఉన్నోళ్ల కన్నీరు తుడిచేందుకు ప్రతీ ఊరూ వెళతా! ప్రతి గడపా తొక్కుతా! బాధితులకు భరోసానిస్తా’’ లోకేష్ ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-10-27T16:17:16+05:30 IST