డ్వాక్రా మహిళలకు జగనన్న టోకరా: లోకేష్
ABN , First Publish Date - 2021-12-03T23:05:33+05:30 IST
ఓటీఎస్ పేరుతో డ్వాక్రా మహిళలకు జగనన్న టోకరా వేస్తున్నాడని
అమరావతి: ఓటీఎస్ పేరుతో డ్వాక్రా మహిళలకు జగనన్న టోకరా వేస్తున్నాడని టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఎద్దేవా చేశారు. వన్టైమ్ సెటిల్మెంట్ పేరుతో డ్వాక్రా మహిళల ఖాతాలు ఖాళీ అవుతున్నాయన్నారు. జగన్రెడ్డి కబంధహస్తాల్లో అభయహస్తం చిక్కిందని లోకేష్ ఆరోపించారు. వన్టైమ్ సెటిల్మెంట్ ఎవరూ కట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇళ్ల పట్టాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుందని లోకేష్ ప్రకటించారు.