తల్లి, చెల్లి గురించి నీవు మాట్లాడటం సిగ్గు చేటు: Naseer

ABN , First Publish Date - 2021-10-22T17:28:17+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ సంఘీభావం తెలిపింది.

తల్లి, చెల్లి గురించి నీవు మాట్లాడటం సిగ్గు చేటు: Naseer

గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ సంఘీభావం తెలిపింది.  హిమనీ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద ఇన్‌చార్జ్ నసీర్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలని నినాదాలు చేశారు. రాజకీయాలకు కుటుంబ సభ్యులను వాడుకునే వ్యక్తి జగన్ అని నసీర్ అన్నారు. ఎన్నికల సమయంలో తల్లి, చెల్లిని వాడుకొని వదిలేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. రెండున్నరేళ్ల పాలనలో ఏనాడైనా తల్లి , చెల్లి గురించి ఆలోచించావా అని ప్రశ్నించారు. ‘‘నీ దుర్మర్గాన్ని భరించలేక నిన్ను, నీ రాష్ట్రాన్ని వదిలి తల్లి, చెల్లి వెళ్లిపోయారు. తల్లి, చెల్లి గురించి నీవు మాట్లాడటం సిగ్గు చేటు’’ అని నసీర్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-22T17:28:17+05:30 IST