డీజీపీ వ్యాఖ్యలపై చినరాజప్ప ఆగ్రహం

ABN , First Publish Date - 2021-01-16T17:43:16+05:30 IST

ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ, బీజేపీ ఉందన్న డీజీపీ వ్యాఖ్యలపై మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీజీపీ వ్యాఖ్యలపై చినరాజప్ప ఆగ్రహం

రాజమండ్రి: ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ, బీజేపీ ఉందన్న డీజీపీ వ్యాఖ్యలపై  మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోడు, మతిస్థిమితం లేని వ్యక్తులు ఈ దాడులు చేసారని తప్పించుకునే ప్రయత్నం చేశారని... ఇప్పుడు టీడీపీ, బీజేపీ వాళ్ళు అంటున్నారని మండిపడ్డారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాల్లో దాడులకు పాల్పడిన ఒక్క నిందితుడిని అరెస్ట్ చేయలేకపోయారన్నారు. ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందని చంద్రబాబు ముందే చెప్పినా డీజీపీ పట్టించుకోలేదని...ఇప్పటికైనా సమగ్రమైన విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చెయాలని చినరాజప్ప డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-01-16T17:43:16+05:30 IST