తాలిబన్లు కూడా అసూయ పడేలా రాష్ట్రంలో జగన్ పాలన: Nimmala

ABN , First Publish Date - 2021-10-21T17:08:04+05:30 IST

రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. తాలిబన్లు కూడా అసూయ పడేలా రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన ఉందన్నారు.

తాలిబన్లు కూడా అసూయ పడేలా రాష్ట్రంలో జగన్ పాలన: Nimmala

అమరావతి: రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. తాలిబన్లు కూడా అసూయ పడేలా రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన ఉందన్నారు. సీఎం, డీజీపీ కలిసి ప్రతిపక్ష నేతలను అంత చేయాలనే కుట్ర పన్నారని ఆరోపించారు. అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబుపై వైసీపీ మూక రాళ్లు రువ్వితే భావ ప్రకటన స్వేచ్ఛ అని డీజీపీ చెప్పడంతోనే పరిస్థితి అర్థమైందన్నారు. జోగి రమేష్ 30 కార్లతో వచ్చి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడికి దిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నారు.  ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు డీజీపీ ఆఫీసుకు వెళితే బాధితులపైనే తిరిగి కేసులు పెట్టారని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై రాళ్లు, గొడ్డలతో దాడి చేసి తలలు పగులకొట్టినా డీజీపీ స్పందించలేదని... పైగా రియాక్షన్ ఉంటుందని చెప్పారని మండిపడ్డారు. దాడులకు బాధ్యత ఏ-1 జగన్ రెడ్డిది అయితే ఏ-2 డీజీపీది అని అన్నారు. ఎర్రచందనం, అక్రమ బియ్యం, హవాలా, తలనీలాల అక్రమ రవాణ, గంజాయి, హెరాయిన్‌కు అడ్డా ఆంధ్రప్రదేశ్ అని నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-21T17:08:04+05:30 IST