ధర్మవరం ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డ పరిటాల శ్రీరామ్
ABN , First Publish Date - 2021-03-08T16:42:52+05:30 IST
ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డిపై టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ప్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని అన్నారు.
అనంతపురం: ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డిపై టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ప్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ అభ్యర్థులు పేదలు కాబట్టే వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. ‘‘మొదటి సారి ఎమ్మెల్యే కాగానే ఇల్లు కట్టావ్... రెండోసారి ఎమ్మెల్యే కాగానే గుర్రాల కోట కట్టుకున్నావ్. గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పేరుతో విలువైన భూములు కబ్జా చేస్తున్నావ్...నీ ఒత్తిడి తట్టుకోలేక ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారునీ.. తండ్రి ని హత్య చేస్తే సాక్ష్యం చెప్పకుండా ప్రత్యర్థులతో రాజీ చూసుకున్నావ్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం ప్రశాంతంగా వుందని... చేనేతలు వ్యాపారం చేసుకుంటున్నారంటే అది ఎవరి వల్ల జరిగిందో ఇక్కడి ప్రజలకు తెలుసని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.