విమానంలో ప్రత్యక్షమైన పట్టాభి.. మాల్దీవ్స్‌కంటూ సోషల్ మీడియాలో పోస్టులు

ABN , First Publish Date - 2021-10-25T23:21:44+05:30 IST

రాజమండ్రి జైలు నుంచి విడుదలైన టీడీపీ నేత పట్టాభి విమానంలో ప్రత్యక్షమయ్యారు. జైలు నుంచి విడుదల తరువాత ఆయన అజ్ఞాతంలో....

విమానంలో ప్రత్యక్షమైన పట్టాభి.. మాల్దీవ్స్‌కంటూ సోషల్ మీడియాలో పోస్టులు

అమరావతి: రాజమండ్రి జైలు నుంచి విడుదలైన టీడీపీ నేత  పట్టాభి విమానంలో ప్రత్యక్షమయ్యారు. జైలు నుంచి విడుదల తరువాత ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా విమానంలో ప్రయాణం చేస్తున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. మాల్దీవ్స్‌కు పట్టాభి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు నిర్ధారించలేదు. 


కాగా సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. కానీ పట్టాభి రాజమండ్రి నుంచి విజయవాడకు చేరుకునే సమయంలో హైడ్రామా నెలకొంది. పట్టాభి కాన్వాయ్‌ను తప్ప ఇతర వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులు మరోసారి అరెస్ట్ చేస్తారనే అనుమానంతో పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పట్టాభి ఆచూకీ లేదు. తాజాగా పట్టాభి విమానంలో ఉన్నారని ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. 

Updated Date - 2021-10-25T23:21:44+05:30 IST