కరోనా వల్ల మృతి చెందిన వారికి నివాళులర్పించిన టీడీపీ నేత

ABN , First Publish Date - 2021-05-13T01:57:38+05:30 IST

కరోనా వల్ల మృతి చెందిన వారికి నివాళులర్పించిన టీడీపీ నేత

కరోనా వల్ల మృతి చెందిన వారికి నివాళులర్పించిన టీడీపీ నేత

కర్నూలు: రాష్ట్రంలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నివాళులు అర్పించారు. కర్నూలు జిల్లా టీడీపీ ఆఫీసులో సోమిశెట్టి వెంకటేశ్వర్లు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. రోజురోజుకూ కోవిడ్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఏపీలో కోవిడ్ వల్ల మరణాలు కూడా రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కరోనా నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు చెబుతున్నారు.

Updated Date - 2021-05-13T01:57:38+05:30 IST