దళితులకు అండగా ఉంటారా... భయపెడతారా..: మాణిక్యరావు

ABN , First Publish Date - 2021-12-21T21:30:09+05:30 IST

రాష్ట్రంలోని వైసీపీ బాధితులకు అండగా ఉంటారా లేక బాధిత కుటుంబాలను భయపెడతారో

దళితులకు అండగా ఉంటారా... భయపెడతారా..: మాణిక్యరావు

గుంటూరు: రాష్ట్రంలోని వైసీపీ బాధితులకు అండగా ఉంటారా లేక బాధిత కుటుంబాలను భయపెడతారో హోం మంత్రి స్పష్టం చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు డిమాండ్ చేశారు. జగన్ మద్యం ధరలు తగ్గించారని వైసీపీ కార్యకర్తలు  సంబరాలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సంబరాల సందర్భంగా మద్యం ధరలపై మాట్లాడిన వెంకట నారాయణపై దాడి చేశారన్నారు. బయటకు చెప్పుకోవడానికి కూడా కుటుంబ సభ్యులు బయపడుతున్నారన్నారు. కొద్ది రోజుల క్రితం ఎంపీ నందిగం సురేష్ కూడా ఇలాగే ఓ దళితుడిపై తన ఇంట్లో దాడి చేసాడన్నారు. దీనిపై హోం మంత్రి సుచరిత తక్షణమే స్పందించాలన్నారు. బాధితులకు అండగా ఉంటారో... బాధిత కుటుంబాలను భయపెడతారో స్పష్టం చేయాలన్నారు. జగన్ రెడ్డి జన్మదినం సందర్భంగా దళితులకు ఇచ్చిన గిఫ్ట్‌గా తాము భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2021-12-21T21:30:09+05:30 IST