ఇది అమరావతి రైతుల నైతిక విజయం: Sharif

ABN , First Publish Date - 2022-03-03T17:32:35+05:30 IST

మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు.

ఇది అమరావతి రైతుల నైతిక విజయం: Sharif

అమరావతి: మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని  శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ...ఈ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఇంత భంగపాటుకు గురైన తర్వాత బిల్లు పెట్టే సాహసం చేస్తుందని అనుకోవడం లేదన్నారు. ఇది అమరావతి రైతుల నైతిక విజయమని తెలిపారు. ఆనాడు శాసనమండలిలో నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపామని చెప్పారు. అయితే తన నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పు పట్టిందన్నారు. ఈ తీర్పుతో మొదటి నుంచి టీడీపీ వాదన కరెక్ట్ అని తేలిందని షరీఫ్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-03T17:32:35+05:30 IST