రుయా ఘటనపై న్యాయ విచారణ జరపాలి: వర్ల
ABN , First Publish Date - 2021-05-13T17:56:14+05:30 IST
రుయా ఆస్పత్రి ఘటనపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు.
అమరావతి: రుయా ఆస్పత్రి ఘటనపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఎందుకు ఆదేశించలేదని నిలదీశారు. ఎవరి డొల్లతనం బయట పడుతోందని భయపడుతున్నారని అన్నారు. రుయా ఘటనపై వెంటనే న్యాయవిచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.