డీజీపీ సవాంగ్‌కి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ

ABN , First Publish Date - 2020-10-01T14:50:03+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుకు డీజీపీ రాసిన లేఖపై ఆ పార్టీ నేత వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.

డీజీపీ సవాంగ్‌కి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు డీజీపీ రాసిన లేఖపై ఆ పార్టీ నేత వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీజీపీ సవాంత్‌కు వర్ల లేఖ రాశారు. డీజీపీ లేఖ అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని  వ్యాఖ్యానించారు. ప్రశ్నించే నోళ్లను నొక్కాలన్న ఉద్దేశం డీజీపీ లేఖ బహిర్గతం చేసిందన్నారు. చంద్రబాబు ప్రాథమిక హక్కుని హరించే విధంగా డీజీపీ లేఖ రాశారని మండిపడ్డారు. బి.కొత్తకోట రామచంద్రపై దాడి కేసు క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని అడిగితే...సాక్ష్యాలు సీల్డ్ కవర్‌లో పంపామని ఎద్దేవా చేస్తారా అని ప్రశ్నించారు. అంతర్వేది రథాన్ని తగలబెట్టింది చంద్రబాబే అని విజయసాయి అంటే...సాక్ష్యాలు కోరుతూ అతనికి డీజీపీ ఎందుకు లేఖ రాయలేదని ఆయన నిలదీశారు. రామచంద్రపై దాడి కేసులో ముద్దాయి ప్రతాపరెడ్డి... టీడీపీకి చెందినవాడని చెప్పడానికి డీజీపీ దగ్గర ఉన్న సాక్ష్యాలేమిటని అడిగారు. హైకోర్ట్ తప్పుపట్టినా, వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా...డీజీపీ బరి దాటి ప్రతిపక్షనేతకు లేఖ రాయడం అభ్యంతరకరమని వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-10-01T14:50:03+05:30 IST