ఇద్దరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2021-06-18T02:51:07+05:30 IST

రాష్ట్ర డీజీపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లేఖ

ఇద్దరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య

అమరావతి: రాష్ట్ర డీజీపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లేఖ రాశారు. సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సునీల్‌కుమార్, కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ సత్తిబాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. స్వచ్ఛంద సంస్థను స్థాపించి దళిత యువతను ఉద్రేకపరుస్తున్నారని  రామయ్య పేర్కొన్నారు. రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించే రీతిలో ఉపన్యాసాలిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. సర్వీస్ కండక్ట్ రూల్స్‌ను ఉల్లంఘించిన ఆ ఇద్దరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఆ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-18T02:51:07+05:30 IST