బ్రాహ్మణుల కోపాగ్ని జ్వాలల్లో మాడిపోకముందే...: టీడీపీ నేత
ABN , First Publish Date - 2021-05-13T18:34:43+05:30 IST
కరోనా రెండోదశలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించకుండా ముఖ్యమంత్రి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షఉలు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య మండిపడ్డారు.
అమరావతి: కరోనా రెండోదశలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించకుండా ముఖ్యమంత్రి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షఉలు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో బ్రాహ్మణులు హలో లక్ష్మణా అని విలపిస్తున్నారని అన్నారు. చనిపోయిన బ్రాహ్మణుల అంత్యక్రియల నిమిత్తం చంద్రబాబు ప్రభుత్వం రూ.10వేలు అందించేదని... ఈ ముఖ్యమంత్రి ఆ పథకాన్ని నిలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో ప్రతి జిల్లాలో దాదాపు 2 నుంచి 3 వందల మంది బ్రాహ్మణులు చనిపోయారని తెలిపారు. వారి కుటుంబాలకు ఈ ముఖ్యమంత్రి, మల్లాది విష్ణు, కోనరఘుపతి ఏం సాయం చేశారని ప్రశ్నించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని అనేక బ్రాహ్మణ కుటుంబాలు కడుపుమంటతో విలపిస్తున్నాయన్నారు. బ్రాహ్మణుల కోపాగ్ని జ్వాలల్లో మాడిపోకముందే, జగన్మోహన్ రెడ్డి మేల్కోవాలని ఆనంద్ సూర్య హెచ్చరించారు.