రాజధాని అంశం పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం: Yanamala

ABN , First Publish Date - 2022-03-03T16:59:35+05:30 IST

రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు.

రాజధాని అంశం పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం: Yanamala

అమరావతి: రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ముందు నుంచి టీడీపీ మూడు రాజధానులు బిల్లు చెల్లదని చెబుతూనే ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకొని, మూడు రాజధానులపై ముందుకు వెళ్ళిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతో నైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆయన హితవుపలికారు. హైకోర్టు తీర్పును గౌరవించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని... మరో అప్పీల్‌కు వెళ్ళకూడదన్నారు. హైకోర్టు చెప్పిన విధంగా రాజధాని భూములు అభివృద్ధి చేసి ప్రభుత్వం రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి నాశనమైందని యనమల రామకృష్ణుడు అన్నారు. 


Updated Date - 2022-03-03T16:59:35+05:30 IST