అసత్య ప్రచార ఫ్లెక్సీలపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-10-24T11:32:21+05:30 IST
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై అసత్య ప్రచార ఫ్లెక్సీలను పెట్టడంపై శుక్రవారం మండల టీడీపీ నాయకులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ముత్తుకూరు, అక్టోబరు23: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిపై అసత్య ప్రచార ఫ్లెక్సీలను పెట్టడంపై శుక్రవారం మండల టీడీపీ నాయకులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీఎన్టీయూసీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ సోమిరెడ్డిపై అసత్య ప్రచారాలతో కూడిన ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు మతి చెడి వాస్తవాలను మరిచి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సరి కాదన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం జరిగిందని, వారిని ఆదుకోవాలని చెప్పినందుకు తమ నాయకుడు సోమిరెడ్డిపై కక్ష సాధించేందుకు అసత్య ప్రచారాలకు పూనుకోవడం దారుణమన్నారు.
సర్వేపల్లిలో వైసీపీ నాయకులు అత్యంత నీచస్థాయి రాజకీయాలకు దిగజారడం దురదృష్టకరమన్నారు. అసత్య ప్రచార ఫ్లెక్సీల ఏర్పాటుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఐ అంజిరెడ్డికి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పల్లంరెడ్డి రామ్మోహన్రెడ్డి, ఈపూరు మునిరెడ్డి, సన్నారెడ్డి సురేష్రెడ్డి, ముసునూరు రామ్మోహన్రెడ్డి, నన్నం దీనయ్య, పెడకాల కాంతారావు, యల్లంగారి రమణయ్య, అక్కంగారి ఏడుకొండలు, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.