చంద్రబాబు, లోకేష్ కోలుకోవాలని పూజలు
ABN , First Publish Date - 2022-01-20T05:29:18+05:30 IST
ఇటీవల కరోనా సోకిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధానా కార్యదర్శ నారా లోకేశ్ త్వరగా కోలుకోవాలని బుధవారం పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు చేయించారు.
భీమవరంటౌన్/నరసాపురం రూరల్, జనవరి 19 : ఇటీవల కరోనా సోకిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధానా కార్యదర్శ నారా లోకేశ్ త్వరగా కోలుకోవాలని బుధవారం పంచారామ క్షేత్రమైన గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు చేయించారు. పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్ కరోనా బారిన పడడం బాధాకరమన్నారు. నరసాపురం మండలం కే.బేతపూడిలో గోగులమ్మ, వెంకమ్మ, కనకదుర్గ, పట్టణంలోని నాగారమ్మ ఆలయాల్లో నియోజ కవర్గ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, నాయకులు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాదాసు కనకదుర్గ, కోళ్ళ నాగబాబు, మామిడి శెట్టి ప్రసా ద్, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము, టి.వెంకట కృష్ణగుప్త, మద్దుల మూర్తి, యలమంచిలి శ్రీనివాస్, వేమవరపు శ్రీనివాస్, రామకృష్ణ, నర్సింహారావు, బాబూరావు, గునిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.