హమాలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2020-04-05T22:17:09+05:30 IST

లాక్‌డౌన్ నేపథ్యంలో పస్తులతో కాలం వెళ్లదీస్తున్న హమాలీలకు టీడీపీ నేతలు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. జిల్లాలోని మడకశిర ప్రాంతంలో...

హమాలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన టీడీపీ నేతలు

అనంతపురం: లాక్‌డౌన్ నేపథ్యంలో పస్తులతో కాలం వెళ్లదీస్తున్న హమాలీలకు టీడీపీ నేతలు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. జిల్లాలోని మడకశిర ప్రాంతంలో ఉన్న హమాలీలను కలిసిన ఏమ్మేల్సి గుండుమల తిప్పేస్వామి, టీడీపీ మాజీ ఏమ్మేల్యే ఈరన్నలు వారికి వంద మందికి బియ్యం, కందిపప్పు అందజేశారు. ఈ సందర్బంగా మాజీ ఏమ్మేల్యే ఈరన్న మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వేల ప్రాణాలను బలిగొంటున్న కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్లనుంచి బయటకు రావద్దని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ రోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని విద్యుత్ దీపాలను ఆర్పివేసి భారతీయులంతా ఒక్కటే అనే విషయాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-05T22:17:09+05:30 IST