చంద్రయ్య హత్య ముమ్మాటికీ రాజకీయ హత్యే: TDP leaders

ABN , First Publish Date - 2022-01-13T16:59:12+05:30 IST

ఓటమి భయంతో వైసీపీ పాలకులు ఫ్యాక్షన్‌కు పురుడు పోస్తున్నారని టీడీపీ నేతలు నక్కా ఆనంద బాబు, దూళిపాళ్ల నరేంద్ర, కోవెలమూడి రవీంద్ర అన్నారు.

చంద్రయ్య హత్య ముమ్మాటికీ రాజకీయ హత్యే: TDP leaders

గుంటూరు: ఓటమి భయంతో వైసీపీ పాలకులు ఫ్యాక్షన్‌కు పురుడు పోస్తున్నారని టీడీపీ నేతలు నక్కా ఆనంద బాబు, దూళిపాళ్ల నరేంద్ర, కోవెలమూడి రవీంద్ర అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్య ముమ్మాటికీ రాజకీయ హత్యే అని మండిపడ్డారు. ఓటమి భయంతోనే పిన్నేల్లి ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-13T16:59:12+05:30 IST