నానిని అరెస్టుచేసేదాకా పోరాటం
ABN , First Publish Date - 2022-01-26T09:03:42+05:30 IST
గుడివాడ కేసినో వ్యవహారంలో ప్రమేయం ఉన్న మంత్రి కొడాలి నాని అరెస్టు జరిగే వరకూ పోరాటం కొనసాగించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ అంశంపై ఆ పార్టీ నియమించిన నిజ
కేసినో నిర్వహణలో ఆయన ప్రమేయం
జాతీయ దర్యాప్తు సంస్థలకు విచారణ బాధ్యత అప్పగించాలి
గవర్నర్ను కలిసి కోరదాం: టీడీపీ
‘కేసినో నిర్వహణతో రూ.వందల కోట్లు ఆర్జించారు. రూ.50 వేలు ప్రవేశ రుసుమే పెట్టారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎక్కడకు పోయిందో తేలాలి. ఈడీ, డీఆర్ఐ, నిఘా, ఐటీ వంటి సంస్ధలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. మా పోరాటంతో న్యాయం జరగకపోతే కోర్టును కూడా ఆశ్రయిస్తాం’ అని చెప్పారు. తాను గుడివాడలో పోలీసు అధికారిగా పనిచేసినప్పుడు నానిని ఎన్నిసార్లు కొట్టానో... బూటు కాలితో తన్నానో ఇప్పుడు చెప్పడం భావ్యం కాదని, ఆ రోజుల్లో రోడ్ సైడ్ రోమియోగా ఉన్న అతడి ఆర్థిక స్థాయి అప్పుడేమిటో.. ఇప్పుడేమిటో గుడివాడలో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. బుద్దా వెంకన్న తిట్టాడని అరెస్టు చేసిన పోలీసులు అంతకంటే భయంకరమైన తిట్లు మంత్రి నాని తిడితే ఎందుకు అరెస్టు చేయలేదని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రశ్నించారు.