చంద్రబాబు, లోకేష్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-01-20T20:56:01+05:30 IST

కరోనా మహమ్మారి బారిన పడిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని చింతలపూడి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు నత్త నాగేంద్ర గురువారం పూజలు నిర్వహించారు.

చంద్రబాబు, లోకేష్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

ఏలూరు: కరోనా మహమ్మారి బారిన పడిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని చింతలపూడి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు నత్త నాగేంద్ర గురువారం పూజలు నిర్వహించారు. చింతలపూడిలోని గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు, ఏలూరు పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షుడు రెడ్డి సూర్యచంద్రం అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ త్వరగా కోలుకుని ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొబ్బర రాజ్ పాల్, మండల పట్టణ అధ్యక్షులు, సాయిల సత్యనారాయణ, రావూరి కృష్ణ, కుక్కల మాధవరావు, ఆకుమర్తి రామారావు, గొల్లమందల శ్రీనివాస్, బొడా అనిష్, బుసా సత్యనారాయణ, ఎలికే ప్రసాద్, కరుటూరి రామాదేవి, గన్నిన సురేంద్ర, పింటూ సాహెబ్,  రాగాని వంశీ, లాగు సురేష్, అద్దెపల్లి రవి,  గంటా శ్రీనివాస్, చంద్రరావు, కర్పూరం వెంకన్నబాబు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T20:56:01+05:30 IST