రాజధాని రైతులకు టీడీపీ నేతల సంఘీభావం

ABN , First Publish Date - 2021-03-09T21:56:50+05:30 IST

రాజధాని రైతులకు టీడీపీ నేతల సంఘీభావం

రాజధాని రైతులకు టీడీపీ నేతల సంఘీభావం

అమరావతి: రాజధాని రైతులకు తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం సంఘీభావం తెలిపారు. మహిళా దినోత్సవం రోజు మహిళలపై పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్యన్నారు. అమరావతి ఉద్యమం మొదలు అయిన రోజు నుంచి రైతులపై పోలీసులు కేసులు పెడుతూనే ఉన్నారని చెప్పారు.  అమరావతి రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌కు అన్ని తెలిసి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతి ఉద్యమంలో చురుగ్గా ఉన్న మహిళలను పోలీసులు టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాదెండ్ల బ్రహ్మం ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-03-09T21:56:50+05:30 IST