కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2020-07-08T19:56:37+05:30 IST

విజయవాడ: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యుల్ని టీడీపీ నేతలు పరామర్శించారు.

కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన టీడీపీ నేతలు

విజయవాడ: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యుల్ని టీడీపీ నేతలు పరామర్శించారు. కొల్లు భార్యతో మాట్లాడారు. కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన వారిలో.. విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఏపీ పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మన్ నాగుర్ మీరా, జడ్పీ మాజీ చైర్ పర్సన్ గద్దె అనూరాధ ఉన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. అత్యంత సౌమ్యుడైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను రాజకీయ స్వార్ధం కోసం హత్యా నేరంలో ఇరికించారన్నారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగానే టీడీపీ బీసీ నేతలపై జగన్ కక్ష కట్టారని వాపోయారు. 

Updated Date - 2020-07-08T19:56:37+05:30 IST