లోకేష్‌ను కలిసిన టీడీపీ నాయకులు

ABN , First Publish Date - 2021-06-19T05:17:26+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను శుక్రవారం కర్నూలు సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద డోన్‌ నియోజకవర్గ టీడీపీ నాయకులు కలిశారు.

లోకేష్‌ను కలిసిన టీడీపీ నాయకులు
నారా లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌

డోన్‌, జూన్‌ 18: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను శుక్రవారం కర్నూలు సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద డోన్‌ నియోజకవర్గ టీడీపీ నాయకులు కలిశారు. పార్టీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ నారా లోకేష్‌ను కలిసి వైసీపీ ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తోందని వివరించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్‌, ధర్మవరం సుబ్బారెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీ కృష్ణ గౌడు, విజయభట్టు, రేగటి అర్జున్‌ రెడ్డి తదితరులు కలిశారు. 

Updated Date - 2021-06-19T05:17:26+05:30 IST