బుధ, గురువారం టీడీపీ మహానాడు... చర్చించే అంశాలివే
ABN , First Publish Date - 2020-05-27T03:14:05+05:30 IST
బుధ, గురువారం టీడీపీ మహానాడు నిర్వహించనుంది. బుధవారం ఉ.10.30కి టీడీపీ ఆఫీస్లో ఎన్టీఆర్కు చంద్రబాబు నివాళి అర్పించనున్నారు. అనంతరం ..
అమరావతి: టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు బుధ, గురువారం ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహించనుంది. బుధవారం ఉదయం10.30 నిమిషాలకు టీడీపీ ఆఫీస్లో ఎన్టీఆర్కు చంద్రబాబు నివాళులర్పించనున్నారు. అనంతరం ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్లో మహానాడును నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా మహానాడులో 14 వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారు. 14 తీర్మానాలు ఆమోదించనున్నారు. వైసీపీ ఏడాది పాలన, వైఫల్యాలు, అమరావతి రాజధాని, పోలవరం, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై మహానాడులో చర్చించనున్నారు. వీటితో పాటు టీడీపీ కార్యకర్తలపై దాడులు, నేతలపై అక్రమ కేసులు, రైతు రుణమాఫీ వ్యవసాయ సంక్షోభం అంశాలపైనా మహానాడులో చర్చించనున్నారు.