తెలుగు తమ్ముళ్ల పండుగకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2020-05-27T16:28:29+05:30 IST

తెలుగు తమ్ముళ్ల పండుగకు సర్వం సిద్ధమైంది.

తెలుగు తమ్ముళ్ల పండుగకు సర్వం సిద్ధం

అమరావతి: తెలుగు తమ్ముళ్ల పండుగకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 11 గంటలకు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రాహానికి చంద్రబాబు నివాళులర్పించి.. పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో మహానాడు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా మహానాడులో 14వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారు.


ఏటా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ కోలాహలంగా మూడు రోజుల పాటు సమావేశాలు జరిగేవి. ఈసారి కరోనా వైరస్ దెబ్బపడింది. లాక్ డౌన్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్‌లో నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, కొద్ది మంది ముఖ్యులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన నేతలంతా ఎవరి ఇంట్లోనే వారుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కార్యక్రమంలో  పాల్గొననున్నారు.


Updated Date - 2020-05-27T16:28:29+05:30 IST