ఆన్‌లైన్‌లో టీడీపీ మహానాడు కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-05-27T10:32:39+05:30 IST

తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల 27, 28 తేదీలలో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు

ఆన్‌లైన్‌లో టీడీపీ మహానాడు కార్యక్రమాలు

మంచిర్యాల, మే 26 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల 27, 28 తేదీలలో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకట నలో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా మహాసభలు నిర్వహించే వీలులేనందున చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు జూమ్‌ యాప్‌ ద్వారా మహానాడు తీర్మానాలు ఆమోదించనున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు నెక్లెస్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం మహానాడు కార్యక్రమాలను ప్రారం భించనున్నట్లు తెలిపారు. డివిజన్ల వారీగా కార్యకర్తలు, నాయకులు సేవా కార్య క్రమాలను నిర్వహించాలన్నారు. బుధవారం ఉదయం రామకృష్ణాపూర్‌, మంచిర్యాల, గోదావరిఖనిలోని పార్టీ కార్యాలయాలలో జెండావిష్కరణ  ఉం టుందన్నారు. అనంతరం చంద్రబాబనాయుడు జూమ్‌ ఆప్‌ ద్వారా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రానున్న రోజుల్లో పార్టీని ముందుకు నడిపించే విధంగా దిశ, నిర్దేశం చేస్తారని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-05-27T10:32:39+05:30 IST