హైకోర్టు తీర్పును స్వాగతించిన టీడీపీ పొలిట్‌బ్యూరో

ABN , First Publish Date - 2022-03-03T19:20:17+05:30 IST

రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ పోలిట్ బ్యూరో స్వాగతించింది.

హైకోర్టు తీర్పును స్వాగతించిన టీడీపీ పొలిట్‌బ్యూరో

అమరావతి: రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ పోలిట్ బ్యూరో స్వాగతించింది. గురువారం టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో మీటింగ్ మొదలైంది. హైకోర్టు తీర్పుపై పార్టీ పొలిట్‌బ్యూరో చర్చించింది. జగన్ ఇప్పటికైనా మూడు రాజధానులు అనే మోసాన్ని కట్టిపెట్టాలని సమావేశం డిమాండ్ చేసింది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని ప్రకటించి వెంటనే అమరావతి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేసింది. మూడు రాజధానుల పేరుతో ఇతర ప్రాంతాలను సీఎం మోసం చేశారని నేతలు చెబుతున్నారు. కోర్టు తీర్పును స్వాగతిస్తూ... రాజధాని నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పోలిట్ బ్యూరో తీర్మానం చేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్స్యూరెన్స్ ద్వారా రూ.100 కోట్ల సాయం అందించినట్లు లోకేష్ వివరించారు.

Updated Date - 2022-03-03T19:20:17+05:30 IST